13 ఏళ్లుగా ధోనీ రాక కోసం అమ్మ కానీ అమ్మ వెయిటింగ్
- October 13, 2017
వెస్ట్ బెంగాల్, ఖరగ్పూర్కు చెందిన 77 ఏళ్ల కళావతి ధోనీ కోసం వెయిట్ చేస్తోంది. మాజీ కెప్టన్ మహేంద్రసింగ్ ధోనీ ఫస్ట్ టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేసిన విషయం తెలిసిందే. ఐతే ఆయన పోస్టింగ్ ఖరగ్పూర్ సౌత్ సైడ్ రైల్వేలో పడింది. దీంతో ఆయన అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. అక్కడ కళావతి ధోనికి హెల్పర్ గా ఉండేది. ఆమె వంట తప్ప మిగతా అన్ని పనుల్లో ఆయనకు సహాయకారిగా ఉండేది. ఓ సారి ధోనీ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు కళావతే దగ్గర ఉండి అన్ని పనులు చేసిందట. అప్పటి నుంచి కళావతిని అమ్మగా పిలవడం మొదలు పెట్టాడట ధోని. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆడే అవకాశం రావడంతో ...అక్కడి నుంచి వెళ్లిపోయాడట. వెళుతూ...వెళుతూ ...మళ్లీ వచ్చి నిన్ను తప్పక కలుస్తానని చెప్పి వెళ్లాడట. ఈ మాట చెప్పి దాదాపు 13 ఏళ్లు గడిచాయని ...ఇప్పటికీ ఆయన కోసం వెయిట్ చేస్తున్నట్టు కళావతి తెలిపింది. ఇటీవల ఖరగ్ పూర్ నుంచి వాసూరావు ధోనీని కలిసినప్పుడు అమ్మ ఎలా ఉంది అని యోగ క్షేమాలు ఆరా తీసాడట...అమ్మను చూడటానికి తప్పకుండా వస్తానని తెలపడంతో ఈ విషయం బయటికి వచ్చింది.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







