తొలిసారి ఫైనల్లో మరియా షరపోవా
- October 14, 2017
టియాంజిన్: ఐదుసార్లు గ్రాండ్స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నంబర్వన్, రష్యా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా తొలిసారి ఫైనల్కు చేరుకుంది. అదేంటి ఐదు సార్లు గ్రాండ్స్లామ్ విజేత ఇప్పుడు తొలిసారి ఫైనల్కు చేరడమేమిటని ఆశ్చర్యపోతున్నారా. ఎందుకంటే.. నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్లు వాడా నిర్వహించిన పరీక్షల్లో తేలడంతో షరపోవాపై 15 నెలలు వేటు వేసిన సంగతి తెలిసిందే. నిషేధం ముగించుకుని తిరిగి రాకెట్ పట్టిన రష్యా భామ వైల్డ్ కార్డు ద్వారా పలు టోర్నీలు ఆడింది. కానీ, ఏ ఒక్కసారి ఫైనల్కు చేరుకోలేదు.
తాజాగా చైనాలో జరుగుతోన్న టియాంజిన్ ఓపెన్లో షరపోవా తొలిసారి మహిళల సింగిల్స్లో ఫైనల్కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీస్లో చైనా క్రీడాకారిణి పెంగ్తో జరిగిన పోరులో 3-6, 1-6తో షరపోవా విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఆదివారం షరపోవా.. బెలారస్ క్రీడాకారిణి సబలెంకతో తలపడనుంది. ప్రస్తుతం షరపోవా 86వ ర్యాంకులో కొనసాగుతండగా...
19 ఏళ్ల సబలెంక 102వ ర్యాంకు దక్కించుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్ గెలవాలని సబలెంక భావిస్తుండగా షరపోవానే టైటిల్ ఫేవరేట్గా కనిపిస్తోంది. విజయం ఎవర్ని వరిస్తుందో వేచి చూద్దాం.
ఏప్రిల్లో స్టుగార్ట్లో జరిగిన టోర్నీలో గాయం కారణంగా సెమీస్ నుంచి నిష్క్రమించింది.
ఆ తర్వాత ఇటాలియన్ ఓపెన్లో రెండో రౌండ్లో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







