హత్య చేసి.. ముక్కలు చేసి.. ఫ్రిజ్డ్లో పెట్టిన వైనం
- October 14, 2017
ఢిల్లీలో ఐదు రోజుల క్రితం మిస్సైన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ముక్కలు చేసిన అతడి బాడీ ఒక ఫ్రిజ్డ్లో కనిపించడం కలకలం సృష్టించింది. సోమవారం నుంచి కనిపింకుండా పోయిన విపిన్ జోషి కోసం వెతికిన పోలీసులకు అతడిని క్లోజ్ ఫ్రెండ్సే హత్య చేసినట్టు గుర్తించారు. మృతదేహాన్ని ముక్కలు చేసిన ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేశారు.
29 ఏళ్ల విపిన్ జోషి బార్ టెండర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి అతడు కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలిస్తున్నారు.. శనివారం సైదులాజాబ్ లోని ఒక ఇంటి నుంచి దుర్గంధం వస్తోందని సమాచారం రావడంతో వెళ్లారు. ఇంట్లో సగం మూసి ఉన్న ఫ్రిజ్ తీసి చూసిన పోలీసులకు అందులో మృతదేహం భాగాలు బయటపడ్డాయి. వాటిని విపిన్ జోషిగా గుర్తించిన పోలీసులు అతడి ఫ్రెండ్ చిన్మయ్ బిస్వాల్ను అరెస్ట్ చేశారు. మరో ఫ్రెండ్ బాదల్ మండల్ కోసం గాలిస్తున్నారు.
ముగ్గురూ ఒకే బార్లో పనిచేస్తారు. సైదులాజాబ్ లో వేరు వేరు ఇళ్లలో నివసిస్తారు. మండల్తో కలిసి జోషిని చంపినట్టు బిస్వాల్ ఒప్పుకున్నాడు. హత్యకు కారణం ఏంటనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం కూడా ఇంకా దొరకలేదు. ఘటనాస్థలంలో మద్యం బాటిల్స్, రక్తపు మరకలున్న బట్టలు స్వాధీనం చేసుకున్నారు. రెస్టారెంట్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







