కొత్త నోట్లపై స్వచ్ఛ భారత్ లోగో
- October 15, 2017
న్యూఢిల్లీ: కొత్తగా వచ్చిన 500, 2000 నోట్లను ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా? దానికి ఒకవైపు మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. అయితే ఈ లోగో ఎందుకు ముద్రించారు అని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐకి ఓ ప్రశ్న ఎదురైంది. కానీ దానికి ఆర్బీఐ మాత్రం సమాధానం ఇవ్వలేదు. భద్రతా కారణాల వల్ల ఈ వివరాలను పంచుకోలేమని స్పష్టంచేసింది. ఆ లోగో ముద్రణకు సంబంధించి మార్గదర్శకాల కాపీని ఇవ్వడానికి కూడా ఆర్బీఐ నిరాకరించింది. పీటీఐ కరెస్పాండెంట్ ఆర్టీఐ కింద ఈ ప్రశ్న అడిగారు. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 8 (1) (ఎ) కింద బ్యాంక్ నోట్లపై ముద్రించిన సమాచారం పంచుకోవడం నుంచి మినహాయింపు ఉందని ఆర్బీఐ తెలిపింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే సమాచారాన్ని పంచుకోవ్సాలిన అవసరం లేదని ఈ సెక్షన్ స్పష్టంచేస్తున్నది. ఈ నోట్లకు ఓవైపు కళ్లద్దాలపై స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. కరెన్సీ నోట్లపై వాణిజ్య ప్రకటనలు ముద్రించడానికి ఉన్న మార్గదర్శకాలకు సంబంధించిన కాపీ ఇవ్వమని అడగగా.. దీనికి ఆర్బీఐ నేరుగా సమాధానం ఇవ్వలేదు. కరెన్సీ నోట్ల ముద్రణకు సంబంధించి విధానాలను రూపొందించే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ను ఆర్టీఐ కింద ఈ ప్రశ్న వేశారు. ఈ దరఖాస్తును డీఈఏ ఆర్బీఐకి పంపించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!







