యూఏఈ డ్రైవర్ బాబు రోడ్లపై సాహసకృత్యాలు : మురికిగుంతలో ఇరుక్కొన్న కారు
- October 15, 2017
అబుదాబి: ' సినిమాలు చూసి... ఫైటింగ్ లు చేస్తే ...నడుములు ఎలా జారుతాయో ? కార్లను స్టంట్ మూవీలో ఉరికించినట్లు నడిపితే అబూ ధాబీ ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని తగిన రీతిలో సత్కరిస్తారు. ప్రయాణికులను తరలించే వాహన డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పెట్రోల్ డైరెక్టరేట్ పోలీసులు యూఏఈ డ్రైవర్ బాబు సాహసకృత్యాలు ప్రత్యేకంగా పరిశీలించేందుకు తమ అదుపులోనికి తీసుకొన్నారు. ఆ డ్రైవర్ తన వాహనంను అడ్డదిడ్డంగా నడిపి బానియస్ ప్రాంతంలోని ఒక మురికిగుంతలో అమాంతంగా ఇరికించాడు. ఆ ప్రయాణికులను ఒక చోట నుంచి మరొక చోటుకి తరలించే ఆ వాహనంతో ఉన్న ఇద్దరు ప్రయాణీకులు సైతం అదుపులోకి పోలీసులు తీసుకున్నారు.ఈ సందర్బంగా అబూ ధాబి ట్రాఫిక్ మరియు పెట్రోల్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్ట్నెంట్ కల్నల్ అబ్దుల్లా అల్ సువాయిడ్ మాట్లాడుతూ, ఈ కేసులో డ్రైవర్ మరియు అతనితో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులను సైతం అరెస్టు చేశారు. డ్రైవర్ వద్ద నుంచి ఆ వాహనం స్వాధీనం చేసుకున్నారు.ఆ డ్రైవర్ విపరీతమైన వేగంతో స్టంట్ చిత్రంలో కారుని నడిపినట్లు దీంతో ఆ వ్వ్యక్తి మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించినట్ ఆ అధికారి తెలిపారు. ఈ విధంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్ల తీరుని పసిగట్టేదుకు నిఘా కెమెరాలు పలుచోట్ల ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. 2017 నాటి ఆర్టికల్ సంఖ్య 178 ప్రకారం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న వాహనకారుడు 2,000 దిర్హామ్ జరిమానాతో పటు 23 బ్లాక్ పాయింట్లు మరియు అతని వాహనంను రెండు నెలల కాలం పాటు స్వాధీనం చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించాలని వారి ఆయన తల్లిదండ్రులు కోరారు
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







