కువైట్ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం
- October 15, 2017
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పర్సనల్ ఆరుగురు సభ్యుల డ్రగ్స్ ముఠాని అరెస్ట్ చేసింది. వారి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స యాంఫిటమైన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. 2 మిలియన్లకు పైగా కాప్టగాన్ పిల్స్ని స్మగ్లింగ్ చేసే యత్నాన్ని భగ్నం చేయడం జరిగిందని మినిస్ట్రీకి చెందిన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. యాంటీ నార్కోటిక్స్ జనరల్ డైరెక్టరేట్, ఈ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. వివిధ దేశాలకు చెందినవారి సహకారంతో ఓ వ్యక్తి విమానయానం ద్వారా డ్రగ్స్ని స్మగుల్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఆ యత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. విచారణలో నిందితుడు మరో స్మగ్లింగ్ యత్నం గురించి సమాచారం అందించడంతో, ఇద్దరు సిటిజన్స్ని అరెస్ట్ చేశారు. ఇందులో కస్టమ్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నట్లు తెలియవస్తోంది. 300 కాప్టగాన్ పిల్స్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







