హైదరాబాద్లో ఐదు వందల కోట్ల నకిలీ డ్రగ్స్ సీజ్
- October 16, 2017
చిన్నపిల్లల మందులను వదలని డ్రగ్స్ మాఫియా..
నగరంలో భారీ స్థాయి నకిలీ డ్రగ్స్తయారీ గుట్టు రట్టైంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డ్రగ్స్ తయారవుతున్నాయన్న సమాచారం అందుకున్న రాచకండో పోలీసులు సోమవారం తయారీ కేంద్రంపై దాడి చేశారు. గర్భిణీలు ఎక్కువగా ఉపయోగించే ప్రోటీన్ పౌడర్, టానిక్స్, పిల్లలు తాగే మిల్క్ పౌడర్లను నకిలీగా గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు ఐదు వందల కోట్ల రూపాయలుంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరకు చిన్న పిల్లలు తాగే పాల పౌడర్, గర్బిణీలు ఉపయోగించే మందులను కల్తీ చేస్తుండటం నగరవాసులను కలవర పెడుతుంది. ఈ తయారీ కేంద్రం సహయజమానిగా గుర్తించిన రాజేందర్ రెడ్డి కోసం పోలీసులు వేట మొదల పెట్టారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









