విశాఖలో ఐఎన్ఎస్ కిల్టన్ జాతికి అంకితం
- October 16, 2017
దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ షిప్ ఐఎన్ఎస్ కిల్టన్ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జాతికి అంకితం చేశారు. సోమవారం ఉదయం ఆమె విశాఖలోని తూర్పు నౌకాదళ స్థావరానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె ఐఎన్ఎస్ కిల్టన్ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో నావికాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబ, తూర్పు నావికా దళాధిపతి హెచ్సీఎస్ బిస్త్ పాల్గొన్నారు.
ఐఎన్ఎస్ కిల్టన్ను కార్బన్ ఫైబర్, మిశ్రమ లోహాలతో తయారు చేశారు. దీంతో ఈ కార్వెట్ ప్రయాణాన్ని శత్రుదేశ నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. 'ప్రాజెక్ట్ 28' కింద నిర్మిస్తున్న నాలుగు కార్వెట్లలో ఇది మూడోది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









