రస్ అల్ ఖైమా నివాసితులకు సీవేజ్ బిల్
- October 16, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా నివాసితులు, వచ్చే ఏడాది నుంచి సీవేజ్ బిల్లు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. నీటి వినియోగానికి అదనంగా 50 శాతం బిల్లుని సీవేజ్కి చెల్లించాల్సి ఉంటుంది వినియోగదారులు. ఫెడరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (ఫెవా) బిల్లుతోపాటే సీవేజ్ బిల్లు కూడా వస్తుందని అధికారులు వివరించారు. ఎమిరేట్ వ్యాప్తంగా 85,000 మంది ఫెవా పరిధిలో ఉండగా, 20,000 ఇళ్ళు సీవేజ్ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాయి. మవైరిద్ ప్రాంతాన్ని కనెక్ట్ చేసేందుకు ఫెవా, గత ఆగస్ట్లో పనులు ప్రారంభించింది. జూన్ 2018 నాటికి 564 ప్లాట్లు సీవేజ్ నెట్వర్క్తో కనెక్ట్ అవుతాయి. కొత్త సీవేజ్ సిస్టమ్, పాత ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తుంది. సీవేజ్ డిపార్ట్మెంట్, 65 మిలియన్ దిర్హామ్లతో ఫిల్యా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని నిర్మిస్తోంది. నవంబర్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది.
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









