ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం
- October 16, 2017
ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కార్యాలయంలోని రెండో అంతస్తులోని రూమ్ నెం. 242లో ఉదయం 3.35 గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన పీఎంవో సిబ్బంది.. తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. పీఎంవో వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.
ఈ సందర్భంగా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గుర్ముఖ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తమకు మంగళవారం ఉదయం 3.35 గంటల సమయంలో.. పీఎంవోలో అగ్నిప్రమాదం జరిగినట్లు కంట్రోల్రూమ్కు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. దీంతో హుటాహుటిన పీఎంవో వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసిందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. కంప్యూటర్ యూపీఎస్లో షార్ట్ సర్య్కూట్ సంభవించడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపింది.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









