సైనికులతో దీపావళి జరుపుకోనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- October 17, 2017
కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. రెండురోజుల పాటు నిర్మలా సీతారామన్ అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించనున్నారు.సైనికులతో కలిసి ఆమె దీపావళి వేడుకల్లో పాల్గొంటారని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
బుధవారం నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోని త్రివిధ దళాల కమాండ్లో ఆమె పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సీతారామన్ అక్కడ పర్యటిస్తారు. భద్రత తదితర విషయాలపై ఆమె అక్కడి అధికారులతో చర్చలు జరపనున్నారు.
సైనికులతో కలిసి రక్షణశాఖ మంత్రి సీతారామన్ దీపావళి వేడుకలు జరుపుకుంటారు. దీంతో పాటు సైనికుల కుటుంబాలతో కలిసి నిర్వహించే పలు కార్యక్రమాల్లోను ఆమె పాల్గొంటారని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఈ పర్యటనలో భాగంగా సెల్యులర్ జైలులో ఉన్న స్వతంత్ర జ్యోతి, కార్ నికోబార్లో ఉన్న సునామీ మెమోరియల్ను ఆమె సందర్శించనున్నారు. దీంతో పాటు కార్ నికోబార్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ను ఆమె సందర్శిస్తారు. అండమాన్ నికోబార్ కమాండ్ భారత్లో ఉన్న ఏకైక త్రివిధ దళాల కమాండ్.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







