వర్థమాన గాయని హర్షిత దహియా దారుణ హత్య
- October 18, 2017 హర్యానా గాయని హర్షిత దహియా (22) దారుణ హత్యకు గురయ్యారు. పానిపట్లోని ఇస్రానాలో ఆమెపై దుండగులు కాల్పులు జరిపి, హత్య చేశారు. ఇస్రానాలో మంగళవారం ప్రదర్శన ఇచ్చిన అనంతరం తిరిగి ఢిల్లీలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆమె ఢిల్లీలోని నరేలాలో నివసిస్తున్నారు.
ఈ సంఘటనపై పోలీసు అధికారి ఒకరు విలేకర్లతో మాట్లాడుతూ హర్షిత ఇస్రానాలో ప్రదర్శన అనంతరం కారులో ఢిల్లీ వెళ్తూండగా నలుగురు దుండగులు దాడి చేశారని చెప్పారు. వీరు పానిపట్లోని చమ్రారా గ్రామం వద్ద మరొక కారులో వచ్చారని, ఆమె కారును ఓవర్టేక్ చేసి, కాల్పులు జరిపారని చెప్పారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. పానిపట్లోని ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని ఉంచినట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి