దేశరాజధానిలో 1200 కిలోల టపాసులు సీజ్ చేసిన పోలీసులు
- October 18, 2017
దేశరాజధానిలో బాణసంచా అమ్మకాలకు పాల్పడుతున్న 29 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1200 కిలోల టపాలసులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ సహా దేశరాజధాని పరిథిలో దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించకూడదంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పోలీసు అధికారి మధుర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ''సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 1 వరకు ఢిల్లీలో బాణసంచా అమ్మకాలకు అనుమతి లేదు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల టపాసులు అమ్ముతున్న 29 మందిని అరెస్టు చేశాం. 1200 కిలోల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. మంగళవారం అనేక బాణసంచా షాపులను మూసేవేయించాం...'' అని వెల్లడించారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం నుంచి వ్యాపారులు ఆన్లైన్లో కూడా బాణసంచా అమ్మకాలు నిలిపివేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







