దేశరాజధానిలో 1200 కిలోల టపాసులు సీజ్ చేసిన పోలీసులు

- October 18, 2017 , by Maagulf
దేశరాజధానిలో 1200 కిలోల టపాసులు సీజ్ చేసిన పోలీసులు

దేశరాజధానిలో బాణసంచా అమ్మకాలకు పాల్పడుతున్న 29 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1200 కిలోల టపాలసులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ సహా దేశరాజధాని పరిథిలో దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించకూడదంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పోలీసు అధికారి మధుర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ''సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 1 వరకు ఢిల్లీలో బాణసంచా అమ్మకాలకు అనుమతి లేదు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల టపాసులు అమ్ముతున్న 29 మందిని అరెస్టు చేశాం. 1200 కిలోల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. మంగళవారం అనేక బాణసంచా షాపులను మూసేవేయించాం...'' అని వెల్లడించారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం నుంచి వ్యాపారులు ఆన్‌లైన్‌లో కూడా బాణసంచా అమ్మకాలు నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com