దేశరాజధానిలో 1200 కిలోల టపాసులు సీజ్ చేసిన పోలీసులు
- October 18, 2017దేశరాజధానిలో బాణసంచా అమ్మకాలకు పాల్పడుతున్న 29 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1200 కిలోల టపాలసులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ సహా దేశరాజధాని పరిథిలో దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించకూడదంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పోలీసు అధికారి మధుర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ''సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 1 వరకు ఢిల్లీలో బాణసంచా అమ్మకాలకు అనుమతి లేదు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల టపాసులు అమ్ముతున్న 29 మందిని అరెస్టు చేశాం. 1200 కిలోల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. మంగళవారం అనేక బాణసంచా షాపులను మూసేవేయించాం...'' అని వెల్లడించారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం నుంచి వ్యాపారులు ఆన్లైన్లో కూడా బాణసంచా అమ్మకాలు నిలిపివేశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం