దేశరాజధానిలో 1200 కిలోల టపాసులు సీజ్ చేసిన పోలీసులు
- October 18, 2017
దేశరాజధానిలో బాణసంచా అమ్మకాలకు పాల్పడుతున్న 29 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1200 కిలోల టపాలసులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ సహా దేశరాజధాని పరిథిలో దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించకూడదంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పోలీసు అధికారి మధుర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ''సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 1 వరకు ఢిల్లీలో బాణసంచా అమ్మకాలకు అనుమతి లేదు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల టపాసులు అమ్ముతున్న 29 మందిని అరెస్టు చేశాం. 1200 కిలోల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. మంగళవారం అనేక బాణసంచా షాపులను మూసేవేయించాం...'' అని వెల్లడించారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం నుంచి వ్యాపారులు ఆన్లైన్లో కూడా బాణసంచా అమ్మకాలు నిలిపివేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









