డిసెంబర్ లో రిలీజ్ కానున్న సల్మాన్ 'టైగర్'
- October 18, 2017
సల్లూభాయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'టైగర్ జిందా హై' ఫస్ట్లుక్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా సల్మాన్ లుక్ని ట్విటర్ ద్వారా విడుదలచేశాడు. ఇందులో సల్మాన్ గన్ను పట్టుకుని కోపంగా చూస్తున్న స్టిల్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
ఫస్ట్లుక్పై 'దెబ్బతగిలిన పులిలా ఎవ్వరూ వేటాడలేరు' అని రాసున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఇందులో భాయ్కి జోడీగా కత్రినా కైఫ్ నటిస్తోంది. 2012లో వచ్చిన 'ఎక్ థా టైగర్'కి ఈ చిత్రం సీక్వెల్గా రాబోతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ కోసం సల్మాన్, కత్రినా గ్రీస్ వెళ్లనున్నారు. ఈ ఏడాది 'ట్యూబ్లైట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్కి నిరాశే మిగిలింది. మరోపక్క కత్రినాకి కూడా 'జగ్గా జాసూస్' చిత్రం విజయం అందించలేదు. దాంతో వీరిద్దరూ ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









