క్రాకర్స్ కాల్చడంలో సరికొత్త రికార్డులు
- October 18, 2017
దీపావళి పండుగంటే అందరికీ సరదానే. ఎప్పుడెప్పుడు టపాకాయలు కాలుద్దామా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఒకప్పుడు దీపాలు వెలిగించడంతోనే సంతృప్తి చెందారు. కానీ కాలం మారింది. చెవులు చిల్లులు పడే శబ్దాలతో బాంబులు పేలిస్తే గానీ దీపావళి జరుపుకున్నట్లుగా భావించడం లేదు. అంతటితో ఆగకుండా బాణాసంచా కాల్చడంలోనూ సరికొత్త రికార్డులు సృష్టించారు.
దీపావళి రోజున ఫార్మాలిటీ కోసం టపాసులు కాల్చేవారు కొందరైతే... రికార్డుల కోసం పేల్చేవారు మరికొందరు. 2011లో మాల్టా మక్బాలో అతిపెద్ద విష్ణుచక్రాన్ని కాల్చి రికార్డు స్రుష్టించడమే అందుకు ఉదాహరణ. దీని చుట్టుకొలత ఎంతో తెలుసా... 105 అడుగులు.
ఫిలిప్పీన్స్లో అయితే ఏకంగా గిన్నిస్ రికార్డే నెలకొల్పారు. గతేడాది 30 సెకన్లలో లక్షా 25వేల 801 తారాజువ్వల్ని వెలిగించడం ద్వారా గిన్నిస్ రికార్డు కెక్కారు. రికార్డుల విషయంలో ఇంగ్లాండ్ కూడా పోటీపడింది. 2009లో 6.5 సెకన్లలో లక్షా 10 వేల రకాల బాణసంచా కాల్చి సరికొత్త రికార్డును స్రుష్టించింది.
అతిపెద్ద చిచ్చుబుడ్డిని తయారు చేసిన ఘనత జపాన్ ది. 750 కిలోల బరువైన చిచ్చుబుడ్డిని 54.7 అంగుళాల వ్యాసంతో తయారు చేసి ఔరా అనిపించారు. ఇక టపాసులు కాల్చడం కోసం అత్యధికంగా పది లక్షల డాలర్లు ఖర్చు పెట్టిన ఘనత చైనా సొంతం. 2007లో ఏకంగా 13 కిలోమీటర్ల పొడవునా టపాసులను పరిచి కాల్చారు. ఇలా దీపావళి రోజున పండుగ సంబరంతోపాటు రికార్డులు సృష్టించడానికి వివిధ దేశాలు పోటీపడడం విశేషం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









