రచయిత జార్జ్ సాండర్స్కు బుకర్ ప్రైజ్.!
- October 18, 2017బ్రిటన్కు చెందిన ప్రతిష్టాత్మక మాన్బుకర్ ప్రైజ్ను అమెరికా రచయిత జార్జ్ సాండర్స్ గెలుచుకున్నారు. సాండర్స్ రచించిన ''లింకన్ ఇన్ ది బార్డో'' నవలకు బుకర్ ప్రైజ్ లభించింది. ఈ ప్రైజ్ను గెలుచుకున్న అమెరికన్ రచయితలలో సాండర్స్ రెండో వారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ కుమారుడు పదకొండేళ్ళ విల్లీ మరణానికి సంబంధించి సాండర్స్ రచించిన ''లింకన్ ఇన్ ది బార్డో'' నవల అత్యంత వాస్తవికంగా ఉందని బుకర్ ప్రైజ్ న్యాయ నిర్ణేతల కమిటీ పేర్కొంది. విల్లీ మరణానికి సంబంధించి వందలాది మంది నుంచి సేకరించిన సమాచారాన్ని నవలగా మలిచిన తీరు ప్రశంసనీయమని న్యాయ నిర్ణేతల కమిటీ వెల్లడించింది. ఈ సందర్భంగా రచయిత సాండర్స్ (58) మాట్లాడుతూ ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు. ఈ ఏడాది మాన్ బుకర్ ప్రైజ్కు ముగ్గురు అమెరికా రచయితలు, ముగ్గురు బ్రిటన్ రచయితలు పోటీ పడ్డారు. మొత్తం ఆరుగురిలో జార్జ్ సాండర్స్ అవార్డు గెలుచుకున్నారు. కామన్వెల్త్ దేశాల రచయితలను ప్రోత్సహించేందుకు 1969లో ఈ అవార్డును ప్రోత్సహించారు.
ఆ తరువాత 2014 సంవత్సరంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల రచయితలను కూడా అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు. గత ఏడాది రచయిత పాల్ బీటి ఈ అవార్డును గెలుచుకున్నారు. బీటి రచించిన ''ది సెల్లవుట్'' నవలకు అవార్డు లభించింది. పాల్ బీటి బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి అమెరికా రచయిత.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ