ముస్లింలు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని ఫత్వా జారీ
- October 20, 2017
దారుల్ ఉలూం మరో ఫత్వా జారీ చేసింది. ముస్లింలు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడాన్ని ఫత్వా నిషేధించింది. పురుషులు, మహిళలతోపాటు పిల్లల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని ఫత్వాలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ షహరాన్పూర్కు చెందిన దారుల్ ఉలూమ్ దేవ్బంద్ దీన్ని జారీ చేసింది. భారత దేశంలోని అతిపెద్ద ఇస్లామిక్ సెమినరీస్లలో దారుల్ ఉలూమ్ ఒకటి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో ఫొటోలను పోస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది.
పిల్లలు, పురుషులు, మహిళలు ఇలా ఎవరివైనాసరే ఫొటోలు తీయడం ఇస్లాంకు వ్యతిరేకమని దారుల్ ఉలూం పెద్దలు స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఆధార్, రేషన్ కార్డులు, స్కూళ్లు, కాలేజీలకు అవసరమైన సందర్భంలో మాత్రమే ఫొటోలు తీసుకోవాలని వివరించారు. తన ఫొటోలు, తన భార్య ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చా అంటూ ఓ వ్యక్తి దారుల్ ఉలూంను పర్మిషన్ అడిగారు. దీనిపై క్లారిటీ ఇస్తూ దారుల్ ఇఫ్తా.... ఈ ఫత్వా జారీ చేసింది. దారుల్ ఉలూంలో ఫత్వాలు జారీ చేసే బాధ్యత దారుల్ ఇఫ్తా విభాగానిది.
ఈ మధ్య బ్యూటీపార్లర్లకు వెళ్లే ముస్లీం మహిళల సంఖ్య పెరిగింది. దీనిపైనా దారుల్ ఉలూంకు ఫిర్యాదులు అందడంతో వాటిని పరిశీలించిన మత పెద్దలు... ఐబ్రోస్ చేయించుకోవడం, జుట్టు కత్తిరించడం, ట్రిమ్మింగ్ వంటివాటిపై నిషేధం విధిస్తూ ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు జుట్టు కత్తిరించుకోవడం మత చట్టాలకు వ్యతిరేకమని దారుల్ ఉలూం పెద్దలు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







