దహీ కె కబాబ్
- October 20, 2017కావల్సినవి: గడ్డ పెరుగు - ఒకటిన్నర కప్పు, కొత్తిమీర కట్ట - ఒకటి, ధనియాలు - అరచెంచా, సెనగపిండి - టేబుల్స్పూను, మ్యుసెలీ లేదా కార్న్ఫ్లేక్స్ - పావుకప్పు, జీలకర్రపొడి - అరచెంచా, యాలకులపొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, వెనిగర్ - చెంచా, చిక్కని పెరుగు - అరకప్పు, మిరియాలపొడి - కొద్దిగా.
తయారీ: పెరుగును ఓ గిన్నెలోకి తీసుకుని అందులో ధనియాలపొడీ, సెనగపిండీ, జీలకర్రపొడీ, వెనిగర్, కొత్తిమీర తరుగూ, యాలకులపొడీ, తగినంత ఉప్పూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న పట్టీల్లా చేసుకుని తరవాత మ్యూసెలీ లేదా కార్న్ఫ్లేక్స్లో అద్దాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. దీన్ని ఉల్లిపాయముక్కలు, మిరియాలపొడీ, ఉప్పు వేసిన పెరుగుతో కలిపి వడ్డించాలి.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే