బహ్రెయిన్లో దొంగల ముఠా పట్టివేత
- October 21, 2017
మనామా: కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. 70,000 దిర్హామ్లకు పైగా విలువైన వస్తువుల్ని వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఈ ముఠా ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు ధృవీకరించింది. పక్కా వ్యూహంతో ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతోందని అధికారులు చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాల కోసం నిందితులు యూజ్డ్ కార్లను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్తో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









