అమరవీరుల కుటుంబాలకు అక్షయ్ కుమార్ కానుక దీపావళి.!
- October 21, 2017అమరవీరులైన సైనికుల కుటుంబాలను ఆదుకోవడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఎప్పుడూ ముందుంటారు. వాళ్ల కుటుంబాలకు వీలైన సహాయం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ రేంజ్కు చెందిన దాదాపు 103 అమరవీరుల కుటుంబాల్లో ఆయన ఆనందం నింపారు. వారి కోసం చెక్కు పంపిస్తూ.. మనసుకు హత్తుకునే విధంగా ఓ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసులు, పారామిలటరీ బలగాలు, సైనికుల సమాచారాన్ని కొల్హాపూర్ అధికారులతో కలిసి సేకరించారు.
దాదాపు 103 మంది అమరవీరుల కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.25వేల చెక్కును పంపించారు. దాంతో పాటు ఓ లేఖను, చిన్నారుల కోసం పుస్తకాలు, స్వీట్లు పంపించారు. 'దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న సిబ్బంది కుటుంబసభ్యులైన మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ దీపావళి పండుగ నాడు మీ ప్రియమైన వారితో గడపలేకపోతున్నారని నాకు తెలుసు. కానీ మీరు ధైర్యంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. మీ కోసం మిఠాయిలు, చిన్నారుల కోసం పుస్తకాలు పంపిస్తున్నా. ప్రేమతో అంగీకరించండి' అని లేఖను కూడా అక్కీ పంపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్