మద్యం ఫ్యాక్టరీ పై దాడి : ఇద్దరు ప్రవాసీయులు అరెస్ట్
- October 22, 2017
కువైట్ : సాబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక మద్యం కర్మాగారాన్ని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ లో అధికారులు దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారు, ఆసియా దేశానికి చెందిన ఇరువురు ప్రవాసులు అరెస్టయ్యారు, మద్యంతో నింపిన 140 పీపాలు మరియు మద్యం తయారీ కోసం ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకొన్నారు.. పబ్లిక్ భద్రత వ్యవహారాల సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-త్రారా ఈ సందర్భంగా మాట్లాడుతూ సబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలో ఇద్దరు ఆసియా ప్రవాసీయులు మద్యం చేస్తున్నారనే సమాచారం అందిందని దీంతో వీరిని పెట్టుకొనేందుకు ఒక ప్ర్రత్యేక భద్రతా బృందం ఏర్పడింది. వచ్చిన సమాచారంను నిర్ధారించుకొని , అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకున్న తర్వాత, ఫ్యాక్టరీ పై దాడి చేసి ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకొని వారిని అదుపులోనికి తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. మద్యం తయారీ గురించి ప్రశ్నించినప్పుడు, అనుమానితులు తాము స్థానికంగా తయారుచేసిన మద్యాన్ని తమ తమ కొనుగోలుదారులకు 8 నుంచి 10 కువైట్ దినార్ల ఖర్చుతో విక్రయించినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









