నైజీరియాలో ముగ్గురు మహిళల ఆత్మాహుతి దాడి
- October 23, 2017
నైజీరియాలో ముష్కరులు పేట్రేగిపోయారు. ముగ్గురు మహిళా దళ సభ్యులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. మైదుగురి నగరంలోని ఓ రెస్టారెంట్ ఎదుట ఆదివారం రాత్రి 9.45 నిమిషాలకు ఓ మహిళ తనను తాను పేల్చేసుకుంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో ఇద్దరు మహిళలు తమను తాము పేల్చివేసుకున్నారు. ఆహారం కోసం రెస్టారెంట్ వద్ద పలువురు వేచిఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆప్రాంతమంతా రక్తసిక్తమైంది.
ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాసిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించాయి. బొకోహరం ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









