నైజీరియాలో ముగ్గురు మహిళల ఆత్మాహుతి దాడి
- October 23, 2017
నైజీరియాలో ముష్కరులు పేట్రేగిపోయారు. ముగ్గురు మహిళా దళ సభ్యులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. మైదుగురి నగరంలోని ఓ రెస్టారెంట్ ఎదుట ఆదివారం రాత్రి 9.45 నిమిషాలకు ఓ మహిళ తనను తాను పేల్చేసుకుంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో ఇద్దరు మహిళలు తమను తాము పేల్చివేసుకున్నారు. ఆహారం కోసం రెస్టారెంట్ వద్ద పలువురు వేచిఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆప్రాంతమంతా రక్తసిక్తమైంది.
ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాసిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించాయి. బొకోహరం ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







