సెక్యూరిటీ గార్డుపై దాడి: 8 మంది అనుమానితుల విచారణ
- October 23, 2017
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోని ఎమ్యూజ్మెంట్ పార్క్ వద్ద అరబ్ సెక్యూరిటీ గార్డుపై జరిగిన అతి కిరాతకమైన దాడికి సంబంధించి ఏడుగురు అనుమానితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారించింది. క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ హెడ్ మొహమ్మద్ అల్ మలికి, ఈ విషయాన్ని ధృవీకరించారు. నిందితుల్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడంతోపాటుగా, మిగిలిన నిందితుల్ని పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాధితుడు గాయాల నుంచి కోలుకున్న తర్వాత, ఆయన్నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. దానికి తోడుగా సర్వైలెన్స్ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ని కూడా పరిశీలిస్తారు. ఈ ఘటనలో గాయపడ్డ గార్డుని సలమానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించారు. గార్డ్కి పలు చోట్ల ఫ్రాక్చర్స్ అయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడయ్యింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









