సెక్యూరిటీ గార్డుపై దాడి: 8 మంది అనుమానితుల విచారణ

- October 23, 2017 , by Maagulf
సెక్యూరిటీ గార్డుపై దాడి: 8 మంది అనుమానితుల విచారణ

మనామా: క్యాపిటల్‌ గవర్నరేట్‌ పరిధిలోని ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ వద్ద అరబ్‌ సెక్యూరిటీ గార్డుపై జరిగిన అతి కిరాతకమైన దాడికి సంబంధించి ఏడుగురు అనుమానితుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విచారించింది. క్యాపిటల్‌ గవర్నరేట్‌ ప్రాసిక్యూషన్‌ హెడ్‌ మొహమ్మద్‌ అల్‌ మలికి, ఈ విషయాన్ని ధృవీకరించారు. నిందితుల్ని అరెస్ట్‌ చేయమని ఆదేశాలు ఇవ్వడంతోపాటుగా, మిగిలిన నిందితుల్ని పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాధితుడు గాయాల నుంచి కోలుకున్న తర్వాత, ఆయన్నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. దానికి తోడుగా సర్వైలెన్స్‌ కెమెరాల ద్వారా రికార్డ్‌ అయిన వీడియో ఫుటేజ్‌ని కూడా పరిశీలిస్తారు. ఈ ఘటనలో గాయపడ్డ గార్డుని సలమానియా మెడికల్‌ కాంప్లెక్స్‌కి తరలించారు. గార్డ్‌కి పలు చోట్ల ఫ్రాక్చర్స్‌ అయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడయ్యింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com