ఎంపీల్యాడ్ కోటా నుంచి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి సచిన్

- October 24, 2017 , by Maagulf
ఎంపీల్యాడ్ కోటా నుంచి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి సచిన్

ప్రముఖ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఔదార్యం చూపించారు. ముంబై నగరంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి తన ఎంపీల్యాడ్ కోటా నుంచి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి సచిన్ టెండూల్కర్ ముంబై నగరం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు. సెప్టెంబరు 29వతేదీన ఎల్ఫిన్ స్టోన్ రోడ్డు రైల్వే స్టేషనులో ప్రయాణికుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 23 మంది మరణించిన సంఘటన నేపథ్యంలో ఎంపీ సచిన్ స్పందించారు. ఇరుకుగా ఉన్న వెస్ట్రన్, సెంట్రల్ హార్బర్ సబర్బన్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల కోసం పాదచారుల వంతెనల నిర్మాణానికి వీలుగా సచిన్ టెండూల్కర్ తన ఎంపీ కోటా నిధులిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com