బహ్రెయినీ స్కూలు విద్యార్థికి గాయం - అనుమానం
- October 25, 2017
మనామా: నర్సరీ స్కూల్ విద్యార్థిని భుజానికి ఫ్రాక్చర్ అవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న వైద్యులు, చిన్నారి కోలుకోవడానికి ఏడాది పాటు సమయం పడుతుందని చెప్పారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ, స్కూల్లో ఏం జరిగిందో స్కూలు యాజమాన్యం వెల్లడించలేదనీ, దాంతో చికిత్సలో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. ఘటనకు బాధ్యులైన స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేస్తున్నారు. స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయంటున్నారామె. ఈ ఘటనపై సోషల్ మీడియాలో బాధితురాలి తల్లి పోరాటం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మినిస్ట్రీ, విచారణ కొనసాగుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తొలుత స్కూలు యాజమాన్యం చిన్నారికి ఏమీ అవలేదని చెప్పడం, ఆ తర్వాత స్లైడ్ నుంచి టంబుల్ అయినట్లుగా పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







