గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకున్న చంద్రబాబు
- October 25, 2017
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి కార్పొరేట్ రంగంలో ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉన్న గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్నారు. కార్పొరేట్ గవర్నెన్ప్లో అద్భుతమైన పనితీరు కనబరచినందుకు, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఈ పురస్కారానికి ఎంపికైంది. సంస్థ వైస్ ఛైర్మన్గా ఆమె లండన్ వెళ్లి అవార్డును అందుకున్నారు. వినియోగదారులకు మంచి సేవలు అందించడంలో హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని, ఇందుకు సహకరిస్తున్న సిబ్బంది అందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు.
నారా భువనేశ్వరి హెరిటేజ్ సంస్థ తరఫున గోల్డెన్ పీకాక్ అవార్డు లండన్ లో అందుకున్న సంగతి.. నిజానికి.. సంస్థ ప్రెస్ నోట్ విడుదల చేయడానికంటె ముందే ప్రపంచానికి తెలిసింది. తమ కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడించిన నారా లోకేష్ ఆ ప్రసంగంలో, ముందు రోజు రాత్రే లండన్ లో జరిగిన కార్యక్రమంలో ‘మా అమ్మ అవార్డు అందుకున్నారు’ అనే సంగతి బయటపెట్టారు. తమ కుటుంబానికి సరిపడా లాభాలను హెరిటేజ్ సంస్థ అందిస్తున్నదని.. ఆ సంస్థ ద్వారానే తామంతా బతికిపోతున్నాం అని లోకేష్ ఆ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
ఒకవైపు నారా చంద్రబాబునాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతివైపు పరుగులెత్తించడానికి అహర్నిశలూ కష్టపడుతోంటే.. హెరిటేజ్ డెయిరీ వ్యాపారాన్ని తొలినుంచి అన్నీ తానై నడిపిస్తున్న భువనేశ్వరి అంతర్జాతీయ అవార్డులు సాధించే స్థాయికి సంస్థను తీసుకువెళుతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







