అమెరికాలో యాక్సిడెంట్కు గురైన ఖమ్మం జిల్లా తెలుగు విద్యార్ధిని శ్రీలేఖ
- October 25, 2017
అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన కొల్లూరు శ్రీలేఖ మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లింది. న్యూయార్క్ లోని స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో శ్రీలేఖ తలకు బలమైన గాయాలు అయ్యాయి. శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచారు. శ్రీలేఖ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..
మరోవైపు శ్రీలేఖ తల్లిదండ్రులు కొల్లూరు సురేష్, సుమతిలు కొన్నిసంవత్సరాలుగా మధిరలోని ఆజాద్ రోడ్డులో నివాసముంటూ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడుపుతున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అమెరికా అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీలేఖకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని.. ఇండియన్ కౌన్సిల్ అధికారులకు విదేశాంగశాఖమంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా శ్రీలేఖకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









