అమెరికాలో యాక్సిడెంట్కు గురైన ఖమ్మం జిల్లా తెలుగు విద్యార్ధిని శ్రీలేఖ
- October 25, 2017
అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన కొల్లూరు శ్రీలేఖ మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లింది. న్యూయార్క్ లోని స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో శ్రీలేఖ తలకు బలమైన గాయాలు అయ్యాయి. శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచారు. శ్రీలేఖ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..
మరోవైపు శ్రీలేఖ తల్లిదండ్రులు కొల్లూరు సురేష్, సుమతిలు కొన్నిసంవత్సరాలుగా మధిరలోని ఆజాద్ రోడ్డులో నివాసముంటూ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడుపుతున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అమెరికా అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీలేఖకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని.. ఇండియన్ కౌన్సిల్ అధికారులకు విదేశాంగశాఖమంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా శ్రీలేఖకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







