ముంబైలోని ప్రయాణికులకు రైల్వేశాఖ మంత్రి కొత్త సంవత్సర కానుక
- October 25, 2017
దేశ ఆర్థిక నగరమైన ముంబైలోని ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖామంత్రి పీయూష్ గోయల్ 2018 జనవరి 1న కొత్త సంవత్సర కానుక ఇస్తామని ప్రకటించారు. పశ్చిమ రైల్వే పరిధిలోని ముంబై నగరంలో మొట్టమొదటిసారి ఫస్ట్ ఏసీ లోకల్ రైలు సర్వీసును వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రవేశపెట్టనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా టికెట్ తో నడిచే ఈ లోకల్ ఏసీ రైళ్ల కోచ్ లను చెన్నై నగరంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. కేవలం 20 నుంచి 30 సెకన్ల పాటు స్టేషన్లలో ఆగే ఈ ఏసీ లోకల్ రైళ్లతో ముంబై ప్రయాణికులకు మెరుగైన సేవలందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ముంబయి నగరంలో రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 370 ఎస్కలేటర్లు, సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు పీయూష్ గోయల్ వివరించారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఏసీ లోకల్ రైళ్లను నడుపుతామని మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









