ముంబైలోని ప్రయాణికులకు రైల్వేశాఖ మంత్రి కొత్త సంవత్సర కానుక
- October 25, 2017
దేశ ఆర్థిక నగరమైన ముంబైలోని ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖామంత్రి పీయూష్ గోయల్ 2018 జనవరి 1న కొత్త సంవత్సర కానుక ఇస్తామని ప్రకటించారు. పశ్చిమ రైల్వే పరిధిలోని ముంబై నగరంలో మొట్టమొదటిసారి ఫస్ట్ ఏసీ లోకల్ రైలు సర్వీసును వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రవేశపెట్టనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా టికెట్ తో నడిచే ఈ లోకల్ ఏసీ రైళ్ల కోచ్ లను చెన్నై నగరంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. కేవలం 20 నుంచి 30 సెకన్ల పాటు స్టేషన్లలో ఆగే ఈ ఏసీ లోకల్ రైళ్లతో ముంబై ప్రయాణికులకు మెరుగైన సేవలందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ముంబయి నగరంలో రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 370 ఎస్కలేటర్లు, సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు పీయూష్ గోయల్ వివరించారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఏసీ లోకల్ రైళ్లను నడుపుతామని మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







