శంషాబాద్ లో ఆగివున్న విమానం నుంచి జారిపడ్డ ఎయిర్హొస్టెస్
- October 26, 2017
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(శంషాబాద్)లో ఆగి ఉన్న ఓ విమానం నుంచి ఎయిర్హోస్టెస్ జారి పడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకొంది.
విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మస్కట్ నుంచి ఒమన్ ఎయిర్ లైన్స్ విమానం గురువారం మధ్యాహ్నం 1.40గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది. అనంతరం విమానం పార్కింగ్ స్థలానికి చేరుకుంది.
ప్రయాణికులు ఎక్కేందుకు విమానాన్ని సిద్ధం చేస్తుండగా అందులో ఉన్న ఓ ఎయిర్హొస్టెస్ ప్రమాదవశాత్తు విమానం ప్రవేశ ద్వారం వద్ద నుంచి జారి పడింది. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









