తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా'
- October 26, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి రోబో సీక్వెల్ 2.0. శంకర్ దర్శకత్వంలో రూ.400ల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్. ఆల్ రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వచ్చే జనవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రోబో సీక్వెల్ కంప్లీట్ అవ్వకముందే రజనీకాంత్ మరో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఆ సినిమానే 'కాలా'. ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కబాలి'. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈ సారి కసితో ఈ సినిమా చేస్తోంది టీమ్.
'కాలా' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముంబయ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. అణచివేతకు గురైన తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా రజనీకాంత్ ఇందులో కనిపించబోతున్నారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఉంటుందంటున్నారు. ధనుష్ ఈ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమాని వచ్చే సమ్మర్లో ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









