తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా'
- October 26, 2017సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి రోబో సీక్వెల్ 2.0. శంకర్ దర్శకత్వంలో రూ.400ల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్. ఆల్ రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వచ్చే జనవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రోబో సీక్వెల్ కంప్లీట్ అవ్వకముందే రజనీకాంత్ మరో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఆ సినిమానే 'కాలా'. ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కబాలి'. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈ సారి కసితో ఈ సినిమా చేస్తోంది టీమ్.
'కాలా' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముంబయ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. అణచివేతకు గురైన తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా రజనీకాంత్ ఇందులో కనిపించబోతున్నారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఉంటుందంటున్నారు. ధనుష్ ఈ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమాని వచ్చే సమ్మర్లో ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక