తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా'
- October 26, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి రోబో సీక్వెల్ 2.0. శంకర్ దర్శకత్వంలో రూ.400ల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్. ఆల్ రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వచ్చే జనవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రోబో సీక్వెల్ కంప్లీట్ అవ్వకముందే రజనీకాంత్ మరో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఆ సినిమానే 'కాలా'. ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కబాలి'. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈ సారి కసితో ఈ సినిమా చేస్తోంది టీమ్.
'కాలా' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముంబయ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. అణచివేతకు గురైన తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా రజనీకాంత్ ఇందులో కనిపించబోతున్నారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఉంటుందంటున్నారు. ధనుష్ ఈ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమాని వచ్చే సమ్మర్లో ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









