కువైట్లో ఈ ఆహారం నిషేధం : తిన్నా ...కొన్నా భారీ జరిమానా
- October 27, 2017
కువైట్ : ' చీకులున్నాయా ...చిప్స్ ఉన్నాయా ? నాటు కోడి లెగ్స్ ఉన్నాయా ? అని కువైట్ లో పాట పాడినా శిక్షలు ..జరిమానాలు విధించేలా ఉన్నారు. ప్రజల ఆరోగ్యం, వాతావరణ కాలుష్య కారకాలపై కువైట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది.. ఇందులో భాగంగా కువైట్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మాంసాహారాన్ని గ్రిల్ల్డ్ ఫ్రై లుగా మంటలపై కాల్చేందుకు ఉపయోగించే పొయ్యిలపై నిషేధాన్ని విధించింది. కువైట్లో బీచ్లలో, బహిరంగ ప్రదేశాల్లో మాంసాహారాన్ని కాల్చేందుకు ఈ పొయ్యిలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా మాంసాహారాన్ని కాల్చే పొయ్యిల ద్వారా వాతావరణం కాలుష్యం అవుతోందని కువైట్ వాతావరణ, ప్రజారోగ్య శాఖ తేల్చిచెప్పింది. దేశంలో ఈ పొయ్యిలను వాడితే 10వేల కువైట్ దీనార్ల( 21 లక్షల 48వేల రూపాయలు) జరిమానా విధిస్తూ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









