యూఏఈ ఎయిర్పోర్టుల్లో పొగమంచు
- October 27, 2017
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, పొగమంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా నెలకొంటోందని పేర్కొంది. దుబాయ్, షార్జా, అబుదాబీ ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కన్పిస్తోంది. ఖలీఫా కాలేజ్, దుబాయ్లోని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారు ఝాము నుంచీ పొగమంచు విపరీతంగా నమోదైంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ 1000 మీటర్ల కంటే తక్కువగా నమోదు కానుంది. పగటి పూట వాతావరణం బాగానే ఉంటుందనీ, ఒక్కోసారి పాక్షికంగా మేఘావృతం అవడం జరుగుతుంటుందని ఎన్సిఎంఎస్ పేర్కొంది. మేఘాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అది కూడా సాయంత్రం వేళ మేఘాలు దర్శనమిస్తాయి. సాధారణం నుంచి ఓ మోస్తరు గాలులు వీయనున్నాయి. రాత్రి వేళలో హ్యుమిడిటీ శాతం పెరగనుంది. ఉష్ణోగ్రతలు 36 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చు. హ్యుమిడిటీ లెవల్స్ అత్యధికంగా 95 శాతం వరకు ఉంటాయి. ఆది, సోమవారాల్లోనూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







