కష్టాల్లో భారత కుటుంబం, వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్
- October 28, 2017
ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా.. వెంటనే వారికి సాయమందించడంలో ముందుంటున్నారు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. తాజాగా, మలేషియాలో పాస్పోర్ట్ పోగొట్టుకుని ఇబ్బంది పడిన ఓ భారతీయ కుటుంబానికి సహాయం చేసి మరోసారి ప్రశంసలు అందుకున్నారు.
వారాంతం సందర్భంగా మలేషియాలో భారత దౌత్య కార్యాలయం మూసి ఉండటంతో పాస్పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కుటుంబం ఎయిర్పోర్ట్లోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ కుటుంబం గురించి సుష్మాకు తెలియజేస్తూ మీరా రమేశ్ పటేల్ అనే మహిళ ఓ ట్వీట్ చేసింది.
వారాంతం సందర్భంగా మలేషియాలో భారత దౌత్య కార్యాలయం మూసి ఉండటంతో పాస్పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కుటుంబం ఎయిర్పోర్ట్లోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ కుటుంబం గురించి సుష్మాకు తెలియజేస్తూ మీరా రమేశ్ పటేల్ అనే మహిళ ఓ ట్వీట్ చేసింది.
ఆ ట్వీట్కు వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్... 'ఇది చాలా అత్యవసర విషయం.. దయచేసి దౌత్య కార్యాలయాన్ని తెరిచి భారతీయ కుటుంబానికి సహాయం చేయండి' అంటూ మలేషియాలోని భారత దౌత్య కార్యాలయాన్ని సుష్మా స్వరాజ్ ట్వీట్ ద్వారా ఆదేశించారు. కాగా, ఆ వెంటనే సదరు భారతీయ కుటుంబానికి సహాయం చేసి, సమస్యను పరిష్కరించినట్లుగా భారత దౌత్యకార్యాలయం నుంచి సమాధానం వచ్చింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







