పాక్లో బాంబు దాడి, ప్రతిపక్ష నేత, సోదరుడు మృతి
- October 28, 2017
బలూచిస్తాన్లో జరిగిన బాంబు పేలుడులో కీలక ప్రతిపక్షనేతతోపాటు అతని సోదరుడు మృత్యువాతపడ్డారు. అవామీ నేషనల్ పార్టీ(ఏఎన్పీ) నేత అబ్దుల్ రజాక్, అతని సోదరుడు అబ్దుల్ ఖలిక్ శనివారం ఉదయం పిషిన్ పట్టణంలో జరగనున్న పార్టీ ర్యాలీలో పాల్గొనేందుకు తమ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో నసీరాబాద్ జిల్లా ఛత్తర్ ప్రాంతంలోని హర్నాయి షహ్రాగ్ మార్గంలో మందుపాతర పేలి వారి వాహనం తునాతునకలయింది. ఈ ఘటనలో అబ్దుల్ రజాక్, అబ్దుల్ ఖలిక్ అక్కడికక్కడే చనిపోయారు.
పార్లమెంట్లో ఏఎన్పీకి 8మంది సభ్యులున్నారు. అయితే, ఈ ఘటనకు బాధ్యులెవరనేది తెలియాల్సి ఉంది. ఇదే ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పౌరులు చనిపోయారు. మరో ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలపై అమర్చిన బాంబు పేలటంతో లాహోర్ వైపు వెళ్తున్న అక్బర్ బుగ్తి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









