200 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు పోగొట్టుకున్నా:రాజశేఖర్
- October 28, 2017
ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొంత గ్యాప్ తర్వాత " గరుడ వేగ " మూవీతో నవంబర్ 3 న ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్ కు హిట్ పడి దాదాపు దశాబ్దం అవుతోంది. 'ఎవడైతే నాకేంటి' మూవీ తర్వాత ఇన్నేళ్లకు తన స్టైల్ కు తగ్గ మూవీ 'గరుడ వేగ' అని చెప్పాడు రాజశేఖర్. శుక్రవారం జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన రాజశేఖర్ ఇటీవల మరణించిన తల్లిని గుర్తుచేసుకొని వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు.
తన కెరీర్ పై తల్లి ఆందోళన పడ్డారని కొన్ని సినిమాల వల్ల ఇప్పటి విలువలో లెక్కేస్తే దాదాపు 200 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు పోగొట్టుకున్నానని రాజశేఖర్ ఆవేదన చెందాడు. క్యారెక్టర్.. విలన్ రోల్స్ కూ రెడీ అయ్యానని అయినాకానీ సరైన సబ్జెక్ట్ రాలేదని వాపోయాడు. 'గరుడ వేగ' తనకు మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చే సినిమా అవుతుందని కొండన్ని ఆశలు పెట్టుకున్నారు. గరుడవేగతో అయినా రాజశేఖర్ మళ్లీ హిట్ అందుకుంటాడేమో చూద్దాం..
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025