200 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు పోగొట్టుకున్నా:రాజశేఖర్
- October 28, 2017
ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొంత గ్యాప్ తర్వాత " గరుడ వేగ " మూవీతో నవంబర్ 3 న ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్ కు హిట్ పడి దాదాపు దశాబ్దం అవుతోంది. 'ఎవడైతే నాకేంటి' మూవీ తర్వాత ఇన్నేళ్లకు తన స్టైల్ కు తగ్గ మూవీ 'గరుడ వేగ' అని చెప్పాడు రాజశేఖర్. శుక్రవారం జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన రాజశేఖర్ ఇటీవల మరణించిన తల్లిని గుర్తుచేసుకొని వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు.
తన కెరీర్ పై తల్లి ఆందోళన పడ్డారని కొన్ని సినిమాల వల్ల ఇప్పటి విలువలో లెక్కేస్తే దాదాపు 200 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు పోగొట్టుకున్నానని రాజశేఖర్ ఆవేదన చెందాడు. క్యారెక్టర్.. విలన్ రోల్స్ కూ రెడీ అయ్యానని అయినాకానీ సరైన సబ్జెక్ట్ రాలేదని వాపోయాడు. 'గరుడ వేగ' తనకు మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చే సినిమా అవుతుందని కొండన్ని ఆశలు పెట్టుకున్నారు. గరుడవేగతో అయినా రాజశేఖర్ మళ్లీ హిట్ అందుకుంటాడేమో చూద్దాం..
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







