భార్య, సోదరితో కలిసి కిమ్ టూర్
- October 30, 2017
సియోల్: అమెరికాపై వరుస హెచ్చరికలకు పాల్పడుతున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కాస్త విరామం తీసుకున్నట్లు కన్పిస్తోంది. నిన్నమొన్నటి వరకు అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో బిజీబిజీగా ఉన్న కిమ్.. తాజాగా తన భార్య, సోదరితో కలిసి టూర్కు వెళ్లారు. ప్యాంగ్యాంగ్లోని ఓ సౌందర్య ఉత్పత్తుల ఫ్యాక్టరీకి వెళ్లిన ఆయన అక్కడి సదుపాయాలను పరిశీలించారు.
కిమ్ తన భార్య రి సోల్ జు, సోదరి కిమ్ యో జాంగ్తో కలిసి ప్యాంగ్యాంగ్ కాస్మెటిక్స్ ఫ్యాక్టరీని సందర్శించినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. భార్యతో కలిసి ఉన్న కిమ్ చిత్రాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కిమ్ ప్రశంసల వర్షం కురిపించారట. మహిళల కలలను నిజం చేసే ఉత్పత్తులను తయారు చేస్తున్నారంటూ తెగ పొగిడారట.
ఉత్తరకొరియాను కొన్ని దశాబ్దాల నుంచి కిమ్ వంశస్థులే పాలిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారి కుటుంబసభ్యుల, వ్యక్తిగత వివరాలు మాత్రం బయటి ప్రపంచానికి అంతగా తెలియవు. కిమ్ భార్య రి కూడా అడపాదడపా మాత్రమే మీడియాకు కన్పిస్తుంది. ఇటీవలే కిమ్ సతీమణి మూడో సంతానానికి జన్మనిచ్చినట్లు వార్తలు వచ్చాయి.
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







