కేరళలో కుప్పకూలిన ఐరన్ బ్రిడ్జి.. ఒకరు మృతి, 57మందికి గాయాలు
- October 30, 2017
కేరళలో భారీ ప్రాణ నష్టం తప్పింది. భారీ వంతెన కుప్పకూలి.. ఒకరు చనిపోయారు. 80మందికి పైగా నదిలో కొట్టుకుపోయారు. చివరకు తీవ్ర గాయాలతో ఈదుకుంటూ వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. కొల్లం శివారులోని చవారా ప్రాంతంలోని పురాతన వంతెన ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది.
పురాతన బ్రిడ్జి కూలడంతో ఒకరు మృతి చెందగా, మరో 57 మంది గాయపడ్డారు. స్థానికులు మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్ప కూలింది. ఘటన సమయంలో బ్రిడ్జిపై దాదాపు 80 మంది వరకు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొందరు ఈత కొడుతూ బయటకు వచ్చినప్పటికీ…. ఇనుప బ్రిడ్జి కావడంతో, చాలా మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు. ఈ బ్రిడ్జి చాలా పురాతనమైనదని, తుప్పు పట్టడంతో దీనిపై రాకపోకలు నిలిపివేయాలని చాలా రోజుల క్రితమే కోరినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అధికారులు ఎలాంటి మరమ్మత్తులు చేయకపోవడం, రాకపోకలు నిషేదించకపోవడంతో ప్రమాదం జరిగిందంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







