కేరళలో కుప్పకూలిన ఐరన్ బ్రిడ్జి.. ఒకరు మృతి, 57మందికి గాయాలు
- October 30, 2017
కేరళలో భారీ ప్రాణ నష్టం తప్పింది. భారీ వంతెన కుప్పకూలి.. ఒకరు చనిపోయారు. 80మందికి పైగా నదిలో కొట్టుకుపోయారు. చివరకు తీవ్ర గాయాలతో ఈదుకుంటూ వారంతా ఒడ్డుకు చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. కొల్లం శివారులోని చవారా ప్రాంతంలోని పురాతన వంతెన ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది.
పురాతన బ్రిడ్జి కూలడంతో ఒకరు మృతి చెందగా, మరో 57 మంది గాయపడ్డారు. స్థానికులు మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్ప కూలింది. ఘటన సమయంలో బ్రిడ్జిపై దాదాపు 80 మంది వరకు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొందరు ఈత కొడుతూ బయటకు వచ్చినప్పటికీ…. ఇనుప బ్రిడ్జి కావడంతో, చాలా మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు. ఈ బ్రిడ్జి చాలా పురాతనమైనదని, తుప్పు పట్టడంతో దీనిపై రాకపోకలు నిలిపివేయాలని చాలా రోజుల క్రితమే కోరినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అధికారులు ఎలాంటి మరమ్మత్తులు చేయకపోవడం, రాకపోకలు నిషేదించకపోవడంతో ప్రమాదం జరిగిందంటున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష