ఫిబ్రవరి 9న వస్తానంటోన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
- October 30, 2017
ప్రముఖ నిర్మాణ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా .. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ "వరుణ్ తేజ్ హీరోగా మా బ్యానర్లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి లవ్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఇటీవల సినిమా షెడ్యూల్ లండన్లో జరిగింది. నలభై రోజుల పాటు ఏకధాటిగా జరిగిన ఈ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణలో 70 శాతం టాకీ పూర్తయ్యింది. డిసెంబర్ నెలనాటికి షూటింగ్ను పూర్తి చేస్తాం. థమన్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్, జార్జ్ సి.విలియమర్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్గా నిలుస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







