బుర్జ్ ఖలీఫా వద్ద భారీ సెటప్ తో సాహో
- October 31, 2017
ప్రభాస్- శ్రద్ధాకపూర్ జంటగా రానున్న ఫిల్మ్ 'సాహో'. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్తో మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. కొన్నిరోజుల్లో సాహో యూనిట్ దుబాయ్కి షిఫ్ట్ అవుతోంది. అక్కడ 20 నిమిషాల భారీ యాక్షన్, ఛేజింగ్ సీన్స్ని బుర్జ్ ఖలీఫా వద్ద చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాడు డైరెక్టర్ సుజీత్. ఇందులో కార్లు, బైక్లు, ట్రక్స్ ఉపయోగించనున్నారట. ఇంత ఎక్కువ సన్నివేశాలను ఇప్పటివరకు బాలీవుడ్ మూవీల్లోనూ రాలేదని యూనిట్ చెబుతున్నమాట.
హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో వీటిని షూట్ చేయనున్నారు. గతంలో ట్రాన్స్ఫార్మర్స్, డైహార్డ్ వంటి చిత్రాలకు పనిచేసిన అనుభవం కెన్నీ సొంతం. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్ తదితరులు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ త్రయం శంకర్ - ఎహ్సాన్ - లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసమ్మర్ తర్వాత రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష