దుబాయ్ లో నకిలీ వైద్య నివేదిక జారీ చేసిన భారతీయ వైద్యుడికి జైలుశిక్ష : దేశ బహిష్కరణ
- October 31, 2017
దుబాయ్ : నకిలీ వైద్య నివేదికను రూపొందించి నిందితులకు జారీ చేసిన నేరానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఓ 42 ఏళ్ళ భారతీయ వైద్యునికి ఆరు నెలలు జైలు శిక్ష అనంతరం దేశ బహిష్కరణ విధిస్తూ, కోర్టు అఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ తీర్పు ఇచ్చింది. ఈజిప్ట్ కు చెందిన ఇరువురు సోదరులు 26 ఏళ్ళ ఆడిటర్, 32 ఏళ్ళ ఒక మేనేజర్,ఇద్దరూ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. వారికి మద్దతుగాఒక నకిలీ నివేదికకు సమర్పించి కేసుని తప్పుదోవ పట్టించిన వైద్యుడు సైతం ఈ కేసులో అనూహ్యంగా ఇరుక్కున్నాడు. కోర్టు వీరందరిని దోషులుగా నిర్ధారించారు. వాస్తవానికి, వైద్యపరంగా నియంత్రణలో ఉన్న వెన్నునొప్పికి సంబంధించిన మందులను చట్టవిరుద్ధమైన ఉపయోగం కోసం ఒక తప్పు సమర్థన చేసిన భారతీయ వైద్యుడి ఈ కేసులో అడ్డంగా దొరికిపోయాడు.. ఆడిటర్ నకిలీ నివేదికను ఉపయోగించారు. న్యాయస్థానం విచారణ జరిగే సమయంలో ప్రజా విచారణ సభ్యుడికి ఆ నకిలీ వైద్య నివేది సమర్పించారు. వైద్యుడు తప్పుగా వైద్య సూచనను చేయడమే కాక ఆయన రాసిన మందులు ఆరోగ్య మంత్రిత్వశాఖ నియమించిన నిబంధనలకు అనుగుణంగా లేదు. ఈ ముగ్గురు శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన ఈజిప్ట్ సోదరులకు ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. వారికి నకిలీ వైద్య నివేదిక ఇచ్చి భారతీయ వైద్యుడు బలి పశువుగా మారేడు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







