కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న గాలి
- November 02, 2017
మైనింగ్ లో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్రెడ్డి దృష్టి వెండితెరమీదకు మళ్లింది. త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్టు ఆయన తన మనసులో మాట బయటపెట్టేశారు. అంతేకాదు.. తన కొడుకు కిరీటి రెడ్డి ని హీరోగా పెట్టి సినిమా సినిమా తీయబోతున్నట్టుగా కూడా తెలిపారు. 2018 మార్చి తర్వాత సినీ రంగంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతానని చెప్పారు. తానే స్వయంగా పాడిన పాట సీడీని కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా గాలి బెంగళూరులోని చాముండేశ్వరి స్టూడియోలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సినీరంగ ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు. ఏ పని చేసినా అత్యంత కాస్ట్లీగా భారీ స్థాయిలో నిర్వహించే గాలి.. సొంత కొడుకు సినిమా కోసం ఏ రేంజ్ లో ఖర్చుపెడతాడో చూడాలి. కన్నడ, తెలుగు చిత్రపరిశ్రమలో గాలి తనయుడి సినిమా ప్రభావం గట్టిగానే ఉండొచ్చు కూడా. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్(ఓఎంసీ) అధినేత అయిన గాలి జనార్థనరెడ్డి అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకెళ్లి, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.
పెద్ద నోట్ల రద్దు సమయంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుమార్తె పెళ్లి చేసి మళ్లీ ఇటీవల ఊపుఊపారు గాలి జనార్థనరెడ్డి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు