కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న గాలి
- November 02, 2017
మైనింగ్ లో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్రెడ్డి దృష్టి వెండితెరమీదకు మళ్లింది. త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్టు ఆయన తన మనసులో మాట బయటపెట్టేశారు. అంతేకాదు.. తన కొడుకు కిరీటి రెడ్డి ని హీరోగా పెట్టి సినిమా సినిమా తీయబోతున్నట్టుగా కూడా తెలిపారు. 2018 మార్చి తర్వాత సినీ రంగంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతానని చెప్పారు. తానే స్వయంగా పాడిన పాట సీడీని కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా గాలి బెంగళూరులోని చాముండేశ్వరి స్టూడియోలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సినీరంగ ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు. ఏ పని చేసినా అత్యంత కాస్ట్లీగా భారీ స్థాయిలో నిర్వహించే గాలి.. సొంత కొడుకు సినిమా కోసం ఏ రేంజ్ లో ఖర్చుపెడతాడో చూడాలి. కన్నడ, తెలుగు చిత్రపరిశ్రమలో గాలి తనయుడి సినిమా ప్రభావం గట్టిగానే ఉండొచ్చు కూడా. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్(ఓఎంసీ) అధినేత అయిన గాలి జనార్థనరెడ్డి అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకెళ్లి, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.
పెద్ద నోట్ల రద్దు సమయంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుమార్తె పెళ్లి చేసి మళ్లీ ఇటీవల ఊపుఊపారు గాలి జనార్థనరెడ్డి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







