కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న గాలి
- November 02, 2017
మైనింగ్ లో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్రెడ్డి దృష్టి వెండితెరమీదకు మళ్లింది. త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్టు ఆయన తన మనసులో మాట బయటపెట్టేశారు. అంతేకాదు.. తన కొడుకు కిరీటి రెడ్డి ని హీరోగా పెట్టి సినిమా సినిమా తీయబోతున్నట్టుగా కూడా తెలిపారు. 2018 మార్చి తర్వాత సినీ రంగంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతానని చెప్పారు. తానే స్వయంగా పాడిన పాట సీడీని కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా గాలి బెంగళూరులోని చాముండేశ్వరి స్టూడియోలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సినీరంగ ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు. ఏ పని చేసినా అత్యంత కాస్ట్లీగా భారీ స్థాయిలో నిర్వహించే గాలి.. సొంత కొడుకు సినిమా కోసం ఏ రేంజ్ లో ఖర్చుపెడతాడో చూడాలి. కన్నడ, తెలుగు చిత్రపరిశ్రమలో గాలి తనయుడి సినిమా ప్రభావం గట్టిగానే ఉండొచ్చు కూడా. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్(ఓఎంసీ) అధినేత అయిన గాలి జనార్థనరెడ్డి అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకెళ్లి, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.
పెద్ద నోట్ల రద్దు సమయంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుమార్తె పెళ్లి చేసి మళ్లీ ఇటీవల ఊపుఊపారు గాలి జనార్థనరెడ్డి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









