పాక్ జాతిపిత కూతురు దినా మృతి
- November 03, 2017పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఏకైక కుమార్తె దినా వాడియా గురువారం న్యూయార్క్లోని తన ఇంట్లో మృతి చెందారు. 98 ఏళ్లు వయస్సు గల ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మరణవార్తను వాడియా గ్రూప్ ప్రతినిధి వెల్లడించారు. ఆమెకు కుమారుడు, వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ ఎన్ వాడియా, కూతురు డయానా ఎన్ వాడియా ఉన్నారు. ఆమె అంత్యక్రియలు న్యూయార్క్లో జరగనున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా దినా వాడియా కుటుంబం న్యూయార్క్లో ఉంటోంది. వ్యాపార అవసరాల నిమిత్తం నుస్లీ వాడియా ముంబైకి వస్తుంటాడు. 1919 ఆగస్టు 15న జన్మించిన దినా వాడియా, పార్శీ కుటుంబానికి చెందిన నెవెల్లీ వాడియాను 1938లో పెళ్లి చేసుకుంది. దేశంలో ఎంతో మంది ముస్లిం అబ్బాయిలు ఉండగా పార్శీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఎందుకని తండ్రి ఆమెను ప్రశ్నించగా మరి నువ్వెందుకు పార్శీ అమ్మాయిని చేసుకున్నావ్? అని దినా తిరిగి ప్రశ్నించిందని అంటారు. మహ్మద్ అలీ జిన్నా కూడా పార్శీ కుటుంబానికి చెందిన రత్తన్ బాయిని పెళ్లిచేసుకున్నాడు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్