ఇకపై బిజినెస్ క్లాస్లో ప్రయాణించనున్న టీమిండియా.!
- November 03, 2017
ఇక నుంచి భారత క్రికెటర్లు బిజినెస్ క్లాస్లో విహరించనున్నారు. సొంతగడ్డపై మ్యాచ్ల కోసం ఆటగాళ్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విమానంలో వెళ్తారన్న సంగతి తెలిసిందే. ఎకానమీ క్లాస్లో వెళ్లే ఆటగాళ్లు ఇక నుంచి బిజినెస్ క్లాస్లో వెళ్లేలా బీసీసీఐ వెసులుబాటు కల్పించింది. ఈ ప్రతిపాదనను త్వరలో అమలు చేయాలని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా ఇప్పటికే సంబంధిత అధికారులకు లేఖ రాశారు. రెండు నెలల క్రితం భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బీసీసీఐను కోరిన సంగతి తెలిసిందే. ఎకానమీ క్లాసులో ఆటగాళ్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కోసారి అభిమానుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. వారి సీట్లలో ఇతరులు కూర్చుంటున్నారు. అంతేకాదు ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు దిగాలని కోరుతున్నారు. ఈ సమస్యలను కెప్టెన్ కోహ్లీ కూడా పలుమార్లు బీసీసీఐ దృష్టికి తీసుకువచ్చాడు. అంతేకాదు పాండ్య, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ లాంటి పొడగరి ఆటగాళ్లు ఎకానమీ క్లాస్లో కూర్చుని ప్రయాణించాలన్నా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై చర్చించిన బీసీసీఐ ఇక నుంచి ఆటగాళ్లు బిజినెస్ క్లాస్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు లేఖ రాశారు. వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనను అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







