మసాజ్ సెంటర్లో దోపిడీ: ముగ్గురికి జైలు శిక్ష
- November 03, 2017
ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు, ఓ మసాజ్ సెంటర్లోకి చొరబడి, సిబ్బందిని దోచుకున్న ఘటనకు సంబంధించి నిందితులు ముగ్గురికీ చెరో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 21, 19, 21 ఏళ్ళ వయసున్న ముగ్గురు నిందితుల్ని ఈ కేసులో దోషులుగా తేల్చింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం ఈ ముగ్గురినీ దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. 2016 నవంబర్ 14న ఈ ఘటన చోటు చేసుకుంది. మసాజ్ సెంటర్లో సిబ్బంది మెడ మీద కత్తి పెట్టి, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను నిందితులు దొంగిలించారు. మసాజ్ సెంటర్లో పనిచేస్తున్న 34 ఏళ్ళ ఫిలిప్పినా, దొంగతనం జరిగిన వైనాన్ని న్యాయస్థానానికి తెలియజేశారు. సంఘటనా స్థలం నుంచి ఫింగర్ ప్రింట్స్ని సేకరించడం ద్వారా నిందితుల్ని పోలీసులు ట్రాక్ చేయగలిగారు. న్యాయస్థానం విధించిన తీర్పుని 15 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం నిందితులకు ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









