మసాజ్ సెంటర్లో దోపిడీ: ముగ్గురికి జైలు శిక్ష
- November 03, 2017ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు, ఓ మసాజ్ సెంటర్లోకి చొరబడి, సిబ్బందిని దోచుకున్న ఘటనకు సంబంధించి నిందితులు ముగ్గురికీ చెరో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 21, 19, 21 ఏళ్ళ వయసున్న ముగ్గురు నిందితుల్ని ఈ కేసులో దోషులుగా తేల్చింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం ఈ ముగ్గురినీ దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. 2016 నవంబర్ 14న ఈ ఘటన చోటు చేసుకుంది. మసాజ్ సెంటర్లో సిబ్బంది మెడ మీద కత్తి పెట్టి, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను నిందితులు దొంగిలించారు. మసాజ్ సెంటర్లో పనిచేస్తున్న 34 ఏళ్ళ ఫిలిప్పినా, దొంగతనం జరిగిన వైనాన్ని న్యాయస్థానానికి తెలియజేశారు. సంఘటనా స్థలం నుంచి ఫింగర్ ప్రింట్స్ని సేకరించడం ద్వారా నిందితుల్ని పోలీసులు ట్రాక్ చేయగలిగారు. న్యాయస్థానం విధించిన తీర్పుని 15 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం నిందితులకు ఉంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు