మసాజ్ సెంటర్లో దోపిడీ: ముగ్గురికి జైలు శిక్ష
- November 03, 2017
ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు, ఓ మసాజ్ సెంటర్లోకి చొరబడి, సిబ్బందిని దోచుకున్న ఘటనకు సంబంధించి నిందితులు ముగ్గురికీ చెరో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 21, 19, 21 ఏళ్ళ వయసున్న ముగ్గురు నిందితుల్ని ఈ కేసులో దోషులుగా తేల్చింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం ఈ ముగ్గురినీ దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. 2016 నవంబర్ 14న ఈ ఘటన చోటు చేసుకుంది. మసాజ్ సెంటర్లో సిబ్బంది మెడ మీద కత్తి పెట్టి, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను నిందితులు దొంగిలించారు. మసాజ్ సెంటర్లో పనిచేస్తున్న 34 ఏళ్ళ ఫిలిప్పినా, దొంగతనం జరిగిన వైనాన్ని న్యాయస్థానానికి తెలియజేశారు. సంఘటనా స్థలం నుంచి ఫింగర్ ప్రింట్స్ని సేకరించడం ద్వారా నిందితుల్ని పోలీసులు ట్రాక్ చేయగలిగారు. న్యాయస్థానం విధించిన తీర్పుని 15 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం నిందితులకు ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







