మసాజ్ సెంటర్లో దోపిడీ: ముగ్గురికి జైలు శిక్ష
- November 03, 2017
ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు, ఓ మసాజ్ సెంటర్లోకి చొరబడి, సిబ్బందిని దోచుకున్న ఘటనకు సంబంధించి నిందితులు ముగ్గురికీ చెరో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 21, 19, 21 ఏళ్ళ వయసున్న ముగ్గురు నిందితుల్ని ఈ కేసులో దోషులుగా తేల్చింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం ఈ ముగ్గురినీ దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. 2016 నవంబర్ 14న ఈ ఘటన చోటు చేసుకుంది. మసాజ్ సెంటర్లో సిబ్బంది మెడ మీద కత్తి పెట్టి, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను నిందితులు దొంగిలించారు. మసాజ్ సెంటర్లో పనిచేస్తున్న 34 ఏళ్ళ ఫిలిప్పినా, దొంగతనం జరిగిన వైనాన్ని న్యాయస్థానానికి తెలియజేశారు. సంఘటనా స్థలం నుంచి ఫింగర్ ప్రింట్స్ని సేకరించడం ద్వారా నిందితుల్ని పోలీసులు ట్రాక్ చేయగలిగారు. న్యాయస్థానం విధించిన తీర్పుని 15 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం నిందితులకు ఉంది.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







