కుళ్లిన మాంసంతో హైదరాబాద్ దమ్ బిర్యానీ వడ్డిస్తున్న హోటల్ యజమానులు
- November 03, 2017
హైదరాబాద్ దమ్ బిర్యానీకి అర్థం మారిపోతోంది. కుళ్లిన మాంసంతో కస్టమర్లను మోసం చేస్తున్నారు. పురుగులు పట్టిన చికెన్ను వడ్డిస్తూ.. హైదరాబాద్ పరువు తీస్తున్నారు.. హోటల్ యజమానులు.
శంషాబాద్లో ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో చాలా హోటళ్లున్నాయి. పేరుగొప్ప హోటళ్లలోను చెడిపోయిన మాంసంతో బిర్యానీ వండుతున్నారు. వారం క్రితం తెచ్చిన నాన్వెజ్ను, ఫ్రిజ్లో ఉంచుతున్నారు. అది గడ్డకట్టి రాయిలా తయారవుతోంది. దాన్నే పెనం మీద.. నూనెలో వేడి చేసి.. మసాలా పొడులు దట్టించి.. ఫ్రెష్గా తెస్తున్నారు. ఆ వేడి మీద.. కస్టమర్లు సైతం లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు.
ఒక్కసారి కిచెన్లోకి వెళ్లి చూస్తే.. ఎంత దరిద్రపుగొట్టు పద్ధతులు ఫాలో అవుతున్నారో తెలుస్తోంది. కుళ్లిపోయి పురుగులు పట్టిన చికెన్, మటన్, చేపలు, రొయ్యల్ని వాడుతున్నారు. ఏకంగా 15 హోటళ్లలో తనిఖీలు జరిగాయి. పాడైపోయిన పదార్థాలను అధికారులు రోడ్డుపై పారబోశారు. బయట తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
శంషాబాద్ ఈవో శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. తమ బండారం బయటపడడంతో కొందరు హోటళ్ల యజమానులు, సిబ్బంది గొడవకు దిగారు. దీంతో.. ఎయిర్పోర్ట్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పరిస్థితి చేయిదాటకుండా చూశారు. ఆహార పదార్థాల విషయంలో మరోసారి ఇలాంటి నీచానికి దిగజారితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హోటళ్ల యజమానుల్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







