ఇప్పుడు మీరు మీ టీవీ ఎయిర్ ఇండియాలో కూడా ఉచితంగా తరలించవచ్చు
- November 04, 2017మస్కట్ : మస్కట్ నుండి భారత దేశానికి ప్రయాణించే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణీకులు ఇకపై తమ వెంట 48 అంగుళాల టి వి వరకు ఉచితంగా త్తేసుకెళ్లేందుకు అనుమతించబడతారని ఎయిర్ ఇండియా జాతీయ రవాణా సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమాచారంను ఈ విధంగా తెలిపింది: "టెలివిజన్ రవాణాకు సంబంధించి 48 అంగుళాల టెలివిజన్ ఈ రోజు నుంచి మరల నోటీసు ఇచ్చేంతవరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులలో ఉచితంగా తమ వెంట తీసుకువెళ్ళవచ్చు. ప్రయాణీకుల ఉచిత సామాను భత్యం మరియు ఉచిత సామాను భత్యం పైన ఉన్న ఏదైనా అదనపు సామాను రుసుములను వసూలు చేయని విధంగా ఇది పరిగణించబడుతుంది. " స్థల అడ్డంకి వలన, మస్కట్ నుండి ఎయిర్ ఇండియా విమానాలలో 48 అంగుళాల టెలివిజన్ మించి తీసుకురావడంకు సాధ్యపడదు, "మంగళవారం జారీ చేసిన ఒక అధికారిక ప్రకటనలో ఎయిర్లైన్స్ తెలిపింది. శుక్రవారం ఎయిర్ ఇండియాకు పోటీ విమాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇదే విధమైన పథకాన్ని ప్రకటించారు. భారతీయ విమానాశ్రయాలలో టీవీ తరలింపుపై పన్ను ఇప్పటికీ చెల్లించవలసి ఉంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







