రిలయన్స్ వాయిస్ కాల్ సర్వీసులు మూత
- November 04, 2017
నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టెలికాం ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్ తన వాయిస్ కాల్ సర్వీసులను మూసివేస్తోంది. డిసెంబర్ 1 నుంచి తమ ఈ సర్వీసులను క్లోజ్ చేస్తున్నట్టు ఆర్కామ్ పేర్కొంది. తమ కస్టమర్లను ఈ ఏడాది చివరి నుంచి ఇతర నెట్వర్క్లకు తరలించనున్నట్టు కూడా వెల్లడించింది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఆదేశాల మేరకు ఆర్కామ్ ఈ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ కేవలం 4జీ డేటా సర్వీసులను మాత్రమే తన కస్టమర్లు అందించనుందని, తన సబ్స్క్రైబర్లకు ప్రస్తుతం అందిస్తున్న వాయిస్ సర్వీసులను 2017 డిసెంబర్ 1 నుంచి మూసివేస్తున్నట్టు ట్రాయ్ అన్ని టెలికాం ఆపరేటర్లకు చెప్పింది. ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, యూపీ ఈస్ట్, వెస్ట్, తమిళనాడు, కర్నాటక, కేరళ వంటి ఎనిమిది టెలికాం సర్కిళ్లలో 2జీ, 4జీ సర్వీసులను అందించనున్నట్టు ఆర్కామ్, ట్రాయ్కు తెలిపింది.
సిస్టెమా శ్యామ్ టెలిసర్వీసెస్లో విలీనమైన తర్వాత సీడీఎంఏ నెట్వర్క్ను అప్గ్రేట్ చేస్తామని, ఢిల్లీ, రాజస్తాన్, యూపీ వెస్ట్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కోల్కత్తాలకు 4జీ సర్వీసులను అందించనున్నట్టు అనిల్ అంబానీకి చెందిన ఈ సంస్థ తెలిపింది. అయితే సబ్స్క్రైబర్లు పెట్టుకునే ఎలాంటి పోర్టింగ్ అభ్యర్థనను కూడా సంస్థ నిరాకరించరాదని రెగ్యులేటరీ, ఆర్కామ్ను ఆదేశించింది. వాయిస్ సర్వీసులను మూసివేయాలని నిర్ణయించిన ఈ సంస్థ రూ.46వేల కోట్ల రుణాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎయిర్సెల్ విలీన ఒప్పందం బెడసికొట్టడంతో, తన వైర్లెస్ సర్వీసులను మూసివేసేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







