పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లిన పవన్కల్యాణ్25
- November 04, 2017
పవర్స్టార్ పవన్కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ నూతన చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. కీర్తిసురేశ్, అను ఇమ్మాన్యుయెల్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఇటీవలే యూరప్ వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ పవన్, త్రివిక్రమ్తో కలిసి దిగిన సెల్ఫీను అను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. 'గుడ్ కంపెనీ.. గుడ్ వర్క్' అని రాశారు. పవన్ స్టైల్గా కప్ పట్టుకుని ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెలాఖరుకు సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. పవన్ 25వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. నవంబరు 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. డిసెంబరులో పాటల్ని, జనవరి 10న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ ఇందులో ఐటీ నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







