డిసెంబర్ 25న 'సౌఖ్యం' సినిమా విడుదల

- November 08, 2015 , by Maagulf
డిసెంబర్ 25న  'సౌఖ్యం' సినిమా విడుదల

ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న 'సౌఖ్యం' సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో హీరో గోపీచంద్‌తో 'లౌక్యం' చిత్రాన్ని నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఆ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ 'సౌఖ్యం'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండగా, దానికి ఆడియన్స్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com