కువైట్ లో భారత రాయబారి సునీల్ జైన్ కు భారత పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అధికారులు వీడ్కోలు
- November 05, 2017
కువైట్ : భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కు చెందిన ముఖ్యాధికారులు నవంబర్ 1 వ తేదీ 2017 న అల్-మురాజన్ బాంకెట్ హాల్, హోటల్ క్రౌన్ ప్లాజాలో భారత్ రాయబారి శ్రీ సునీల్ జైన్ కు వీడ్కోలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కువైట్ లో భారత రాయబారి సునీల్ జైన్ అక్టోబర్ చివరికి విరమణ పొందారు. ఎయిర్ ఇండియా, అశోక్ ఆంగ్రల్, టిసిఐఎల్, సిద్దార్థ ముఖర్జీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కో, రామ్ మోహన్ రెడ్డి, న్యూ ఇండియా అస్యూరెన్స్, అరుణ్ జైరామ్, దేవ్ష్ కుమార్, ఎల్ ఐ సి ,రాజీవ్ సాకుజ పాల్గొన్నారు.భారతదేశం యొక్క రాయబారిగా తన పదవీకాలంలో శ్రీ సునీల్ జైన్ యొక్క మంచితనం మరియు సాధించిన ఘనత గురించి మాట్లాడారు. తన వీడ్కోలు ప్రసంగంలో జైన్ కృతజ్ఞతలు తెలియచేసారు. పలువురు భారతీయ పౌరులకు సహాయం చేసేందుకు అవసరమైన చర్యలు మరియు బాధ్యతలను ప్రదర్శిస్తున్నప్పుడు తానూ ఎదుర్కొన్న సవాళ్లు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇతర సీనియర్ ఆఫీసర్లు ఇండియన్ ఎంబసీ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







